ఉపాయం
: Lakshmi YSR
ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.ఒకరోజు ఆయన తన పొలం దున్నుతూఉంటే రాక్షసి ప్రత్యక్షమై ఆయనని తినడానికి ప్రయత్నిస్తుంది.కాని ఆయన తెలివిగా నన్ను తినవద్దు కావాలంటే నీకు పండిన పంటలో సగం ఇస్తాను నన్ను వదిలెయ్యి అంటాడు. రాక్షసి అందుకు అంగీకరిస్తుంది. నీకు పై భాగం కావాలో కింది భాగం కావాలొ చెప్పు అంటాడు .అది నాకు క్రింది భాగం కావాలి అంటుంది. ఆరైతు వరి పంట వేసి పంట చేతికి రాగానే కోసి ఒప్పందం ప్రకారం పైభాగం తాను తీసుకొని క్రింది భాగం రాక్షసికి ఇస్తాడు.
తాను మోసపోయానని తెలిసినా తనుకోరుకున్నది కాబట్టి ఏమీ చేయలేకపోతుంది. మరు సంవత్సరం రైతు దున్నుతుంటే మరల రాక్షసి వచ్చి తనకు పై పంట కావాలి అని అడుగుతుంది. ఈ సారి రైతు వేరుశనగ పంట వేసాడు. వేరుశనగ పీకగానే రాక్షసి తన వాటా కోసం వచ్చింది. చెప్పినవిధంగానే పైపంట రాక్షసికి ఇచ్చి కింది పంట తను తీసుకున్నాడు.మరలతను మోసపోయినట్లు గ్రహించింది రాక్షసి . ఈ సారి పైది కిందది రెండు కావాలని అడగాలనుకొంటుంది.