భట్టి విక్రమార్క కథలు
భోజరాజు
ధారాపురం అనే మహా నగరానికి రాజు భోజరాజు. అతను గొప్ప పరాక్రమమం కలవాడు. అంతటి సద్గునవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరుపొందాడు. అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు.
క్రూర మ్గాలవల్ల ప్రజలకు కష్టనష్టాల గురించి విన్న భోజరాజు తన మంత్రి నీతిమంతుని పిలిచి క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి అంతా సిద్దం చేయమని చెప్పాడు.
వేటకు కావలసిన అన్ని పరికరరాలతో తగిన సైన్యంతో బయల్దేరారు భోజరాజు నీతిమంతుడు.
అడవిలో డప్పులూ, తప్పెట్ట్లూ వాయించారు సేవకులు పులులు, సింహాలు, ఎలుగుభంట్లూ, పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు. చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు.
రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్ళసాగాడు. వాళ్ళు ఓ చోట జొన్న చేను పక్కగా వెళుతున్నారు. అక్కడ మంచెపై కూర్చుని ఉన్న ఆచేను యజమాని ఐన ఓ బ్రాహ్మణుడు వీళ్ళను చూసి “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు అలసిపోయి ఉన్నారు, జొన్నచేను కంకులు తినడానికి సిద్దంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం” అంటూ ప్రార్థించాడు.
రాజు ఆ బ్రాహ్మడి ఔదర్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారంతో చెప్పాడు.
రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై మంచెపైనుండి దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఖం ముంచుకు వచ్చింది. సరాసరి రాజు వద్దకు వెళ్ళి “రాజ ఇదేమిటి, ధర్మవంతుడివి అని నీకు పేరు, నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు. ఇది నీకెలా న్యాయంగా తోచింది? నేను పేదవాడిని కష్టపడి జొన్న చేను పెంచుకున్నాను. ఇదే నా ఆధారం. కంచే చేను మేసినట్టుగా ఇతరులకు చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది? ఇప్పుడు నేనూ నాకుటుంబం జీవించేదెలా?” అంటూ విలపించసాగాడు. (more…)
